జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, మంగళవారం నస్పూర్ లో విద్యాభివృద్ధి మరియు ఉపాధి అవకాశాల పై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో, జిల్లా మాధ్యమిక విద్యాశాఖ అధికారి అంజయ్యతో కలిసి, కళాశాలల ప్రిన్సిపల్స్తో విద్యా వ్యవస్థలో మార్పులు, నాణ్యమైన విద్య అందించడానికి అవసరమైన చర్యలపై చర్చించారు.
కళాశాలలలో విద్యార్థుల హాజరు శాతం పెంచడం, నూతన కోర్సులకు సంబంధించి అవగాహన కల్పించడం వంటి అంశాలపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ సూచించారు.
అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల ద్వారా వృత్తి విద్య శిక్షణ అందించి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఈ సమావేశంలో సంబంధిత అధికారులు మరియు ఇతరులు పాల్గొన్నారు.












