
భారీ వర్షాలు, వాగులు వంకలు పొర్లుతున్నప్పటికీ లెక్కచేయకుండా ఆదివాసీ హక్కుల పోరాట సమితి 'తుడుందెబ్బ' మంచిర్యాల జిల్లా శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చాయి. ఆదివాసీ హక్కుల పోరాట సమితి 'తుడుందెబ్బ' రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు, మంచిర్యాల పట్టణంలోని మార్క్స్ భవన్ లో 'తుడుందెబ్బ', AEWCA, ఆధార్ సొసైటీ మరియు రాయ్సెంటర్ ఆధ్వర్యంలో తుడుందేబ్బ మంచిర్యాల జిల్లా నూతన కమిటీ ఎన్నికలు నిర్వహించడం జరిగింది.



















