
వచ్చే ఏడాది నిర్వహించనున్న గోదావరి పుష్కరాలను విజయవంతంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే విస్తృత స్థాయిలో ఏర్పాట్లు ప్రారంభించిందని మంచిర్యాల డీసీపీ ఎ. భాస్కర్ తెలిపారు. ఈ నేపథ్యంలో, రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు డీసీపీ, ఏసీపీ, సీఐ, ఇతర అధికారులతో కలిసి గూడెం దేవాలయం ఘాట్ను సందర్శించి, ఏర్పాట్లను పరిశీలించారు.



















