మంచేరియల్, 2026-07-19
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 34వ డివిజన్లో జరిగిన ఆషాడం బోనాల జాతర ఉత్సవాల్లో మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు పాల్గొన్నారు. పోచమ్మ తల్లిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజల సంక్షేమాన్ని కోరారు.
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 34వ డివిజన్లో జరిగిన ఆషాడం బోనాల జాతర ఉత్సవాల్లో మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు పాల్గొన్నారు.
పోచమ్మ తల్లిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించిన సురేఖ, ఆ తల్లి ఆశీస్సులతో మంచిర్యాల నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు.
అనంతరం సురేఖమ్మ గారిని శాలువాతో సన్మానించారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ సల్ల రమ్య-మహేష్, స్థానిక కార్పొరేటర్ అగ్గు సాగర్, 36వ కార్పొరేటర్ అగల్ డ్యూటీ రాణి-రాజు, పట్టణ మహిళా అధ్యక్షురాలు గజ్జల హేమలత, నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.











