మంచేరియల్, 2026-07-22
మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక సాధికారతను బలోపేతం చేసేందుకు బ్యాంకులు కీలక పాత్ర పోషించాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య అన్నారు. బుధవారం జిల్లా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో జరిగిన బ్యాంక్ లింకేజ్ అంశంపై అవగాహన శిక్షణా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, మహిళా సంఘాలకు సకాలంలో రుణాలు అందేలా బ్యాంకులు, సెర్ప్ మధ్య సమన్వయం అవసరమని తెలిపారు.
మహిళా సంఘాల ఆర్థిక సాధికారతలో బ్యాంకులు కీలకపాత్ర పోషిస్తాయని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య అన్నారు. బుధవారం మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక సాధికారతను మరింత బలోపేతం చేయడం, బ్యాంక్ లింకేజీ ప్రక్రియను వేగవంతం చేయడం, మహిళా సంఘాలకు సకాలంలో రుణాలు అందేలా బ్యాంకులు–సెర్ప్ మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా జిల్లా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సెర్ప్ డే - ఎన్.ఆర్.ఎల్.ఎం. స్వయం సహాయక సంఘాల బ్యాంక్ లింకేజ్ అంశంపై ఒకరోజు అవగాహన శిక్షణా కార్యక్రమానికి జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్ తో కలిసి హాజరయ్యారు.
ఈ సందర్బంగా జిల్లా అదనపు కలెక్టర మాట్లాడుతూ, మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థికాభివృద్ధిలో బ్యాంకుల పాత్ర అత్యంత కీలకమని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల విజయవంతమైన అమలుకు బ్యాంకులు, సెర్ప్ అధికారులు పరస్పర సమన్వయంతో పని చేయాలని సూచించారు. మహిళా సంఘాలకు సకాలంలో, అవసరమైన మేరకు రుణాలు మంజూరు చేయడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని తెలిపారు. బ్యాంక్ లింకేజ్, రుణాల మంజూరు, క్రెడిట్ లిమిట్ల పునరుద్ధరణ, పెండింగ్ రుణ దరఖాస్తుల సత్వర పరిష్కారం, వార్షిక రుణ లక్ష్యాల సాధన, మహిళా సంఘాలకు నాణ్యమైన ఆర్థిక సేవలను మరింత సమర్థవంతంగా అందించే విధానాలపై సమగ్రంగా శిక్షణ అందించడం జరిగిందని తెలిపారు.
బ్యాంకులు–సెర్ప్ మధ్య మరింత సమన్వయంతో పనిచేస్తూ ప్రభుత్వం నిర్దేశించిన మహిళా స్వయం సహాయక సంఘాల బ్యాంక్ లింకేజ్ లక్ష్యాలను విజయవంతంగా సాధించాలని, ప్రతి మహిళా సంఘానికి అవసరమైన బ్యాంకింగ్ సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని, మహిళల ఆర్థిక స్వావలంబనకు ప్రతి బ్యాంకు తన వంతు సహకారం అందించాలని తెలిపారు.
వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 39వ డివిజన్లో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అన్వేష్, మేయర్ ధర్ని మధుకర్ తో కలిసి పరిస్థితులను పరిశీలించి వర్షపు నీటి పారుదల, పారిశుద్ధ్య నిర్వహణ, ప్రజలకు అవసరమైన సౌకర్యాలపై సమీక్షించారు. వర్షాకాలంలో ప్రజలు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు మున్సిపల్ సిబ్బంది చేపట్టే చెత్త సేకరణ కార్యక్రమానికి సహకరించాలని, వర్షపు నీటి ప్రవాహానికి ఎలాంటి అడ్డంకులు ఏర్పడకుండా చూసుకోవాలని, ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని, తద్వారా దోమల వ్యాప్తి, సీజనల్ వ్యాధులను నివారించవచ్చని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు గ్రామీణాభివృద్ధి అధికారి అంజయ్య, మంచిర్యాల, పెద్దపల్లి, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల రీజినల్ మేనేజర్లు, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్లు, బ్రాంచ్ మేనేజర్లు, ఫీల్డ్ ఆఫీసర్లు, బ్యాంక్ లింకేజ్ విభాగ అధికారులు, మెప్మా జిల్లా అధికారులు, మున్సిపల్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.











