
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (టిజిఎస్డబ్ల్యుఆర్ఐఈఎస్) ఆధ్వర్యంలో నడుస్తున్న గురుకులాల్లో తాత్కాలిక అధ్యాపకులు, ఉపాధ్యాయుల ఖాళీల భర్తీకి ప్రక్రియ ప్రారంభమైంది. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు సంస్థ సమన్వయకర్త కోటూరి రామ కళ్యాణి తెలిపారు. జిల్లాలోని 9 గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ఈ నియామకాలు జరగనున్నాయి.



















