Mancherial/Jaipur (ప్రజావార్త) జూన్ 29
శ్రీరాంపూర్ ఏరియా జీఎం కార్యాలయం సమీపంలోని జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇంటర్ విద్యార్థి సాయి సునీల్ మృతిచెందాడు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొట్టడమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు.
శ్రీరాంపూర్ ఏరియా జీఎం కార్యాలయం సమీపంలోని జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇంటర్ విద్యార్థి సాయి సునీల్ అక్కడికక్కడే మృతిచెందాడు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
పోలీసుల కథనం ప్రకారం.. రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వెనుక నుండి వచ్చిన కారు వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న సాయి సునీల్ అనే ఇంటర్ విద్యార్థి అక్కడికక్కడే మరణించాడు. కారులో ఉన్న మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారు నెన్నెల మండలం గొల్లపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు కృష్ణమోహన్, ఆయన భార్య పద్మ [స్కూల్ అసిస్టెంట్, వాంకిడి] వారి కుటుంబ సభ్యులుగా గుర్తించారు.
ప్రమాదంపై సమాచారం అందుకున్న జైపూర్ ఎస్ఐ భూమేష్ వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.












