Mancherial/Jaipur (ప్రజావార్త) జూలై 14
చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే, మాజీ పార్లమెంట్ సభ్యులు బాల్క సుమన్ పిలుపు మేరకు కోటపల్లి మండలం సర్వాయిపేటలో SIR (Special Intensive Revision) కార్యక్రమం కింద ఓటర్లకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ వెళ్లి ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ చేశారు.
చెన్నూర్ మాజీ శాసనసభ్యులు, మాజీ పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు బాల్క సుమన్ పిలుపు మేరకు SIR (Special Intensive Revision) కార్యక్రమంలో భాగంగా కోటపల్లి మండలం సర్వాయిపేట గ్రామంలో ఓటర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా BLO రాములుతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ చేశారు. ఫారాన్ని ఎలా సరిగ్గా నింపాలో వివరించి, ఎలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్తలు తెలియజేస్తూ ఓటర్లకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో BLA రాజ్ కుమార్ యాదవ్, కోటపల్లి మండల సోషల్ మీడియా ఇన్చార్జ్ బాపు నాయక్, వార్డు ఓటర్లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.












