మంచేరియల్, 2026-07-26
కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బెల్లంపల్లి చౌరస్తా వద్ద భారత సైనికుల త్యాగాలను స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారు, కార్గిల్ వీరులకు జోహార్లు తెలిపారు.
కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బెల్లంపల్లి చౌరస్తా వద్ద భారత సైనికుల త్యాగాలను స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారు, కార్గిల్ పోరాటంలో మన సైనికుల శౌర్యం, త్యాగం, దేశంపట్ల వారి అచంచలమైన నిబద్ధతను గుర్తుచేసుకుంటూ కార్గిల్ వీరులకు జోహార్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, కార్పొరేటర్లు, కో-ఆప్షన్ సభ్యులు, నాయకులు, మాజీ సైనికులు (EX ఆర్మీ) తదితరులు పాల్గొన్నారు.









