మంచేరియల్, 2026-07-22
నీట్ పేపర్ లీకేజీ నేపథ్యంలో లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇంటి ముందు ధర్నా చేపట్టడాన్ని నిరసిస్తూ లక్షెట్టిపేట్ బీజేపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి హాజరయ్యారు.
నీట్ పేపర్ లీకేజీ ముసుగులో దేశంలో అలజడి సృష్టిస్తున్న లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇంటి ముందు ధర్నా చేపట్టడాన్ని నిరసిస్తూ లక్షెట్టిపేట్ బీజేపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రఘునాథ్ వెరబెల్లి మాట్లాడుతూ, నీట్ పేపర్ లీకేజీపై చర్చకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అయితే రాహుల్ గాంధీ మాత్రం పార్లమెంట్లో చర్చలో పాల్గొనకుండా, దేశ విద్రోహ శక్తులను రెచ్చగొట్టి దేశంలో అల్లర్లు సృష్టించాలనే కుట్రలో భాగంగా ప్రధాన మంత్రి ఇంటి ముందు ధర్నా చేయడం సిగ్గుచేటని అన్నారు. నిన్న ప్రధాన మంత్రి ఇంటి ముందు కాంగ్రెస్ నాయకులు ధర్నా చేపట్టడం దేశ చరిత్రలో ఒక బ్లాక్ డే అని పేర్కొన్నారు. రాహుల్ గాంధీకి నీట్ పేపర్ లీకేజీపై చర్చపై చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్లో చర్చలో పాల్గొనాలని హితవు పలికారు.
ఈ కార్యక్రమంలో పెద్దపల్లి పురుషోత్తం, హరి గోపాల్, నాగిరెడ్డి హేమంత్ రెడ్డి, బొప్పు కిషన్, గుండ ప్రభాకర్, వేముల మధు, సామ వెంకటరమణ, మంద రాజేందర్, గాడికొప్పుల చంద్రమౌళి, బొక్కనపల్లి సతీష్, గొల్ల రాజేష్, కోమాకుల రవి, రాజా గురువయ్య, తగరపు గంగన్న, ముష్కం గంగన్న, కోన చంద్రశేఖర్, బియ్యాల లచ్చన్న, అడ్లూరి దేవేందర్, రాజేశం మరియు తదితరులు పాల్గొన్నారు.












