రామగుండం, 11 September
వినాయక చవితి పండుగ సందర్భంగా వినాయక విగ్రహాల ప్రతిష్ఠాపన, ఉత్సవాల నిర్వహణకు పోలీసుల అనుమతి తప్పనిసరి అని రామగుండము పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. పెద్దపల్లి, జిల్లాల్లో మండపాలు ఏర్పాటు చేసేవారు తప్పనిసరిగా పోలీస్ శాఖ అనుమతి పొందాలని సూచించారు.
వినాయక విగ్రహాల ఏర్పాటుకు పోలీసుల అనుమతి తప్పనిసరి *విగ్రహాల ఏర్పాటుకు ఆన్లైన్లో సమాచారం అందించాలి. నిబంధనలకు లోబడి ఉత్సవాలు నిర్వహించాలి: పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా* ఈ నెల 14వ తేదీ సోమవారం వినాయక చవితి పండుగ సందర్భంగా రామగుండము పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, జిల్లాల్లో మండపాలు ఏర్పాటు చేసి వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి ఉత్సవాలు నిర్వహించాలనుకునే వారు తప్పనిసరిగా పోలీస్ శాఖ అనుమతి పొందాలని రామగుండము పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు.వినాయక విగ్రహాల ఏర్పాటుకు సంబంధించిన పూర్తి వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. ఇందుకోసం https://policeportal.tspolice.gov.in వెబ్సైట్ను సందర్శించి దరఖాస్తుదారుని వివరాలు,విగ్రహం ఏర్పాటు చేసే ప్రదేశం,ఆ ప్రదేశం ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందో, విగ్రహం ఎత్తు, మండపం ఎత్తు, కమిటీ సభ్యుల పేర్లు,వారి ఫోన్ నంబర్లు,విగ్రహాన్ని ప్రతిష్ఠించే తేదీ, నిమజ్జనం చేసే తేదీ, సమయం,ప్రదేశం, నిమజ్జనం చేసే ప్రదేశానికి చేరుకునే వాహనం వివరాలను నమోదు చేయాలి. అదేవిధంగా మండప నిర్వాహకులు, గణపతి ఉత్సవ కమిటీ సభ్యులు, వాలంటీర్ల పేర్లు, ఫోన్ నంబర్లు, చిరునామా తదితర వివరాలను కూడా పూర్తిగా నమోదు చేయాలని సూచించారు. పెద్దపల్లి, జిల్లాల్లోని పట్టణాలు,గ్రామాల్లో ఏర్పాటు చేసే గణపతి మండపాల నిర్వాహకులు తప్పనిసరిగా వెబ్సైట్లో తమ వివరాలను నమోదు చేయాలని కమిషనర్ సూచించారు. ఆన్లైన్లో వివరాలను నమోదు చేయడంలో ఇబ్బందులు ఎదురైతే సమీపంలోని పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని తెలిపారు. పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని ఉత్సవ కమిటీ సభ్యులు మట్టి వినాయక విగ్రహాల ప్రతిష్ఠాపనకు ప్రాధాన్యత ఇవ్వాలని కమిషనర్ సూచించారు. ఎలాంటి అత్యవసర పరిస్థితి ఎదురైనా కమిషనరేట్ పోలీస్ యంత్రాంగం 24 గంటలు అందుబాటులో ఉండి అప్రమత్తంగా ఉంటుందని, అత్యవసర సమయంలో వెంటనే డయల్ 112కు సమాచారం అందించాలని తెలిపారు. మండపాల్లో వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసి ఉత్సవాలు నిర్వహించే నిర్వాహకులు తప్పనిసరిగా పోలీస్ శాఖ నిబంధనలకు లోబడి ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలని పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సూచించారు.











