కార్యక్రమం (ప్రజావార్త) సెప్టెంబర్ 10
ప్రధాని నరేంద్ర మోదీ 25 సంవత్సరాల పాటు అందించిన సేవలకు గుర్తింపుగా, ఆయన జన్మదినం నుండి వరకు దేశవ్యాప్తంగా సేవా హి సేవ కార్యక్రమాన్ని ప్రతి బూత్ స్థాయిలో విజయవంతం చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర గౌడ్ పిలుపునిచ్చారు. మంచిర్యాల జిల్లా కార్యాలయంలో జరిగిన వర్క్షాప్లో ఆయన ఈ సూచనలు చేశారు.
*సేవాహి సంఘటన్ కార్యక్రమాన్ని బూత్ స్థాయిలో నిర్వహించాలి*..... *భాజపా జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర గౌడ్* .ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రిగా,ప్రధానమంత్రిగా 25 సంవత్సరాల పాటు సేవలందించిన సందర్భంగా నరేంద్ర మోడీ జన్మదినం నుండి వరకు నిర్వహించనున్న సేవ ఈ సంఘటనన్ కార్యక్రమాన్ని ప్రతి బూతు స్థాయిలో విజయవంతం చేయాలని భాజపా జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ కోరారు మంచిర్యాల జిల్లా కార్యాలయంలో కార్యక్రమ కన్వీనర్ పట్టి కృష్ణ అధ్యక్షతన జరిగిన వర్క్ షాప్ లో జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో నరేంద్ర మోదీ అభివృద్ధి సేవ ప్రపంచ దేశాలు ఆదర్శంగా తీసుకునే విధంగా ఉన్నాయా అన్నారు. నరేంద్ర మోడీ 25 సంవత్సరాల సేవా అంకితభావం గురించి ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ప్రతి ఒక్క కార్యకర్త నాయకుని బాధ్యత అని అన్నారు. నుండి వరకు జాతీయ పార్టీ ఇచ్చిన 9 కార్యక్రమాలు విజయవంతం చెయ్యాలని సూచించారు ప్రతి బూత్ స్థాయిలో ఆశీస్సుల దీపం లో భాగంగా కేంద్ర ప్రభుత్వ లబ్ధిదారుల ఇళ్లలో నరేంద్ర మోడీ ని ఆశీర్వదిస్తూ ఆశీస్సుల దీపము కార్యక్రమాన్ని నిర్వహించాలని అదేవిధంగా అంగన్వాడి కార్యకర్తల సన్మాన మండల జిల్లా స్థాయిలో. కోటి పిల్లల కలలు మార్పు కథ నమో సేవా గాథ రక్త దాన కార్యక్రమాలు స్వచ్ఛభారత్ కార్యక్రమాలు హెల్త్ క్యాంపులు పెద్ద ఎత్తున నిర్వహించి ప్రధాని నరేంద్ర మోడీ సాధించిన విజయాలను ప్రజలకు వివరించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దుర్గమ్మ అశోక్, మీడియా ప్యానెల్ ఇంచార్జి తుల ఆంజనేయులు, జిల్లా ఉపాధ్యక్షులు కమలాకర్ రావు, కార్యదర్శులు రాచర్ల సంతోష్, వైద్య శ్రీధర్ , జిల్లా కన్వినర్లు కార్పొరేటర్ కస్తూరి నాగరాజు, ఏతం శివక్రిష్ణ శిరీష, మహిళా మోర్చా అధ్యక్షులు పచ్చ స్వప్న రాణి, మండల అధ్యక్షులు, నాయకులు కార్యకర్తలు పాల్గొంన్నారు.









