బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి, మంచిర్యాల - హైదరాబాద్ మధ్య కొత్త జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్రానికి వినతి పత్రం అందించారు.
ఈ రోజు హైదరాబాద్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసిన రఘునాథ్, ప్రస్తుతం ఉన్న రాజీవ్ రహదారి వల్ల ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించడానికి కొత్త జాతీయ రహదారి అవసరమని తెలిపారు.
రఘునాథ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి వినతి పత్రం అందిస్తూ, కొత్త నాగ్ పూర్- హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణానికి కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి గారిని కోరాలని విజ్ఞప్తి చేశారు.
ఈ రహదారి నిర్మాణం జరిగితే, వాహనదారుల ఇబ్బందులు తొలగిపోతాయని ఆయన తెలిపారు.












