
జిల్లాలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా ప్రజలకు అందించిన ఎన్యుమరేషన్ ఫారాల సేకరణను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. గురువారం మంచిర్యాలలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన ఈ విషయాలు తెలిపారు. ఈ నెల 24వ తేదీ వరకు కొనసాగే ప్రక్రియలో రాజకీయ పార్టీలు, బూత్ స్థాయి ఏజెంట్లు సహకరించాలని కోరారు.



















