మంచేరియల్, 2026-09-10
తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం న హైదరాబాద్ లో తలపెట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంచిర్యాల జిల్లా పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో జిల్లాలో సన్నాహక సమావేశం నిర్వహించి, పోస్టర్ ను ఆవిష్కరించారు.
తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక మరియు పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంచిర్యాల జిల్లా పిలుపునిచ్చింది. రాష్ట్ర చైర్మన్ శ్రీ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ శ్రీ ఏలూరి శ్రీనివాస్ రావు ల సూచనల గురువారం నాడు తలపెట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మంచిర్యాల జిల్లాలో సన్నాహక సమావేశం నిర్వహించారు. జిల్లా అటవీశాఖ అధికారి కార్యాలయం, మంచిర్యాలలో మంచిర్యాల జిల్లా చైర్మన్ శ్రీ గడియారం శ్రీహరి, సెక్రటరీ జనరల్ శ్రీమతి వనజా రెడ్డి గార్ల ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో చలో హైదరాబాద్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా చైర్మన్ శ్రీ గడియారం శ్రీహరి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సమస్యల పరిష్కారం కొరకు రాష్ట్ర 10వ తేదీన తలపెట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మంచిర్యాల జిల్లా నుంచి 10 వేల మందికి తగ్గకుండా ఉద్యోగులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల, కార్మికుల, పెన్షన్ సమస్యల పరిష్కారం కొరకు మంచిర్యాల నుంచి పెద్ద ఎత్తున హాజరుకావాలని ఆయన తెలిపారు. తదుపరి చలో హైదరాబాద్ వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సన్నాహక సమావేశంలో మంచిర్యాల జిల్లా కో-చైర్మన్లు పొన్న మల్లయ్య, శ్రీపతి బాపురావు, డిప్యూటీ సెక్రటరీ జనరల్ అత్తే సుధాకర్, బొడ్డు శ్రావణ్ కుమార్, వైస్ చైర్మన్ సూరినేని గంగాధర్, నాగుల గోపాల్, సెక్రటరీలు తంగళ్ళపల్లి తిరుపతి, సత్యనారాయణ, అజయ్ ప్రశాంత్, ప్రకాష్, అభిషేక్, టీజీవో, టీఎన్జీఓ నాయకులు, వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల మరియు కార్మిక సంఘాల ప్రతినిధులు, నాయకులు మరియు జిల్లాలోని అన్ని శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు.











