మంచేరియల్, 13-07-2026
ఈరోజు, తేది 13-07-2026 సోమవారం, మంచిర్యాల జిల్లాలోని శివాలయాల్లో భక్తుల సందడి పెరిగింది. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివారికి అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈరోజు రాత్రికి అమావాస్య, ఆర్ద్ర నక్షత్రం కలయికతో శివారాధనకు ప్రత్యేక ఫలితం ఉంటుందని పండితులు తెలిపారు.
ఈరోజు, తేది 13-07-2026 సోమవారం, మంచిర్యాల జిల్లాలోని శివాలయాల్లో భక్తుల సందడి పెరిగింది. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివారికి అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈరోజు రాత్రికి అమావాస్య ఉండటం, అదే సమయంలో ఆర్ద్ర నక్షత్రం రావడం విశేషంగా చెప్పుకుంటున్నారు. పరమేశ్వరునికి ప్రీతికరమైన ఆర్ద్ర నక్షత్రం, పితృదేవతలకు ప్రాధాన్యత కలిగిన అమావాస్య కలిసి రావడంతో ఈరోజు చేసే శివారాధనకు ప్రత్యేక ఫలితం ఉంటుందని పండితులు తెలిపారు.
ఈరోజు శివారాధన చేయడం వల్ల పరమేశ్వరుడు, పితృదేవతలు కరుణించి భక్తుల కోరికలు తీరుస్తారని విశ్వాసంతో పూజలు చేశారు. జిల్లా వ్యాప్తంగా మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు తదితర ప్రముఖ శివాలయాల్లో ఉదయం నుంచే రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు, మహాన్యాస పూర్వక పూజలు కొనసాగాయి.












